Breaking News

త్యాగం చేసిన మహిళకు న్యాయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

మే 16, (నేటి తెలుగు పత్రిక): ఆదిలాబాద్ జిల్లాలో బాలికల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు తన పుస్తెల తాడు తాకట్టు పెట్టిన మహిళకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి స్పందన లభించింది. టీవీ9లో ప్రసారమైన కథనానికి స్పందించిన జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే బకాయిలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు.బజార్ హత్నూర్ మండలంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఎనిమిది మరుగుదొడ్లు నిర్మించేందుకు నవనీత అనే మహిళ రూ.8.40 లక్షలు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారు. అయితే రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.జిల్లా కలెక్టర్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న ఆమె పరిస్థితి మీడియాలో రావడంతో మంత్రి జూపల్లి స్పందించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని ఆర్థిక శాఖకు లేఖ రాశారు. బాలికల కోసం త్యాగం చేసిన ఆ తల్లికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *