Breaking News

“భగీరథ్ లొంగుబాటు? పీఎస్ వద్ద భారీ బందోబస్తు”

మే 16, (నేటి తెలుగు పత్రిక): మైనర్ బాలికపై పోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పోలీసులకు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలో ఉన్నారని తెలుస్తోంది.ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఉపశమనం లభించకపోవడంతో, భగీరథ్ సరెండర్ అయ్యే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా సరెండర్ కావాలని సూచించిన నేపథ్యంలో, పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయన లొంగుబాటు అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పీఎస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

“తెలంగాణలో జూన్ 25 నుంచి SIR ఓటర్ సవరణ ప్రక్రియ ప్రారంభం”: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

త్యాగం చేసిన మహిళకు న్యాయం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *