మే 16, (నేటి తెలుగు పత్రిక): పిల్లలు భారం కాదు.. దేశానికి సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన, జనాభా పెరుగుదలను ప్రోత్సహించే దిశగా కీలక ప్రకటన చేశారు.మూడో బిడ్డ పుడితే రూ.30 వేల ప్రోత్సాహకం, నాలుగో బిడ్డకు రూ.40 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.అలాగే ‘తల్లికి వందనం’ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.15 వేల ఆర్థిక సాయాన్ని కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం వెల్లడించారు. చంద్రబాబు ప్రకటనతో సభలో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.
