Breaking News

మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జంట హత్యలు.. ఫైనాన్స్‌ వివాదమే కారణమా?

మే 16, (నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. కొద్ది రోజులుగా అదృశ్యమైన ఈ ఇద్దరు మహిళలను నిందితులు డబ్బుల పేరుతో ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఫైనాన్స్‌ లావాదేవీల వివాదమే హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు.నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

ఐపీఎల్ టికెట్ స్కామ్‌లపై హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక.. నకిలీ యాప్‌లతో భారీ మోసాలు

స్త్రీనిధితో మహిళలకు ఆర్థిక బలం.. కోటి మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి సీతక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *