Breaking News

గిగ్ వర్కర్ల సమస్యలపై రాహుల్ గాంధీతో మంత్రి వివేక్ భేటీ

మే 17, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది.గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వివేక్ రాహుల్ గాంధీకి వివరించారు. వారికి మెరుగైన భద్రత, పని పరిస్థితులు, సామాజిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఈ అంశంపై త్వరలో తెలంగాణలో ఒక భారీ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం కీలకంగా మారుతుందని మంత్రి వివేక్ పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *