Breaking News

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతర తాగునీటి సరఫరా: కేటీఆర్

మే 17, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.కృష్ణా, గోదావరి నదుల జలాలను రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా అందించిన ప్రభుత్వం కూడా బీఆర్ఎస్‌దేనని గుర్తుచేశారు. అదే విధంగా భవిష్యత్తులో తాగునీటి సరఫరాను కూడా నిరంతరాయంగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు.ప్రజలు ఎప్పుడు నల్లా తెరిచినా తాగునీరు వచ్చేలా ఆధునిక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

భగీరథ్‌కు అనుకూల పోస్టులు: 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు

పోక్సో కేసు: బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తొలగించాలి – కేటీఆర్ డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *