Breaking News

భగీరథ్‌కు అనుకూల పోస్టులు: 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసినట్లు ఆరోపణలపై 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని కంటెంట్ తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారు మైనర్ బాలికను తప్పుగా చూపిస్తూ బండి భగీరథ్‌కు అనుకూలంగా పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.అదే సమయంలో బాధితురాలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కూడా ఇప్పటికే వేరుగా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పోస్టులపై సైబర్ టీమ్ కూడా దర్యాప్తు ప్రారంభించింది.సోషల్ మీడియాలో బాధితుల గోప్యతను ఉల్లంఘించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *