Breaking News

విద్యాశాఖ కాదు.. విపత్తుల శాఖగా మారింది: రాహుల్ గాంధీ విమర్శలు

మే 18, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని విద్యాశాఖ ప్రస్తుతం “డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిజాస్టర్స్”లా మారిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా 22 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన పేర్కొన్నారు.అలాగే సీబీఎస్ఈ 12వ తరగతిలో అమలు చేసిన OSM విధానం వల్ల విద్యార్థుల మార్కులు భారీగా తగ్గాయని ఆరోపించారు. మరోవైపు 9వ తరగతి విద్యార్థులు కొత్త భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలంటూ అకస్మాత్తుగా ఆదేశాలు జారీ చేయడం గందరగోళానికి దారితీసిందన్నారు.ఈ పరిణామాలపై ప్రధాని మోదీ స్పందించాలని, లక్షలాది మంది విద్యార్థులకు క్షమాపణ చెప్పాలంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. పుణె లెక్చరర్ అరెస్ట్

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. వాహనదారులకు మరో షాక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *