మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలో హనీ ట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకున్న మహిళ.. ఫొటోలు, వీడియోలు, ఓయో గది బిల్లులను చూపిస్తూ బెదిరించి మూడేళ్లుగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ఖైరతాబాద్కు చెందిన ఎల్డీసీ స్థాయి ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మహిళ బ్లాక్మెయిల్కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
