మే 18, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ కేసులో పోలీసులు మరో కీలక సెక్షన్ను చేర్చారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో భగీరథ్పై బీఎన్ఎస్ 64(2)(ఎం) సెక్షన్ నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే కనీసం పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అతడిపై బీఎన్ఎస్ 74, 75 సెక్షన్లతో పాటు పోక్సో చట్టంలోని పలు నిబంధనల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
