Breaking News

యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

మే 18, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పరిధిలో ఈ నెల 23న నిర్వహించనున్న వేద పాఠశాల శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు యాదగిరిగుట్ట దేవస్థాన అర్చక బృందం, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *