Breaking News

“ఈ జన్మకి చాలు”.. పవన్‌ను కలిసిన తనీష్ భావోద్వేగ పోస్ట్

మే 18, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ నటుడు తనీష్ అల్లాడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ‘జనసేన సాధక్’ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, పవన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.ఈ భేటీ అనంతరం తనీష్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. “ఏం కావాలి ఇంతకన్నా.. చాలు ఈ జన్మకి. కట్టే కాలేంత వరకు మీతోనే కళ్యాణ్ సర్” అంటూ భావోద్వేగంగా స్పందించారు.సినీ పరిశ్రమలో 27 ఏళ్లుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలవడం ఇదే తొలిసారని తనీష్ తెలిపారు. “ఆయన్ను చూడగానే కొన్ని క్షణాలు మాటలు రాలేదు. మనం కలిసి పనిచేద్దాం అని పవన్ సర్ చెప్పిన మాట జీవితాంతం గుర్తుండిపోతుంది” అని పేర్కొన్నారు.గత ఏడాది నుంచి తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్న తనీష్.. యువతలో పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నిజాయితీ, ప్రజాసేవా దృక్పథం తనను ఎంతో ప్రభావితం చేసిందని చెప్పారు.

సోషల్ మీడియా ప్రచారం కాదు.. ప్రజల ముందుకు రండి: దేవినేని ఉమ

రైతు వ్యతిరేక పాలన వైసీపీదే: అచ్చెన్నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *