మే 18, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చేపడుతున్న చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లు నరకరాదని స్పష్టం చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనుల నేపథ్యంలో పర్యావరణానికి నష్టం జరుగుతోందంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.పర్యావరణ ప్రేమికుల తరఫున సీనియర్ న్యాయవాది కె. వివేక్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చెట్ల తొలగింపుతో నగర పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. 25 నుంచి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్ల నరికివేతపై తాత్కాలిక నిషేధం విధించింది.ఈ కేసులో తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసిన న్యాయస్థానం ఆదేశాలతో కేబీఆర్ జంక్షన్ పరిసరాల్లో జరుగుతున్న ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ పనులకు తాత్కాలిక ఆటంకం ఏర్పడింది. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన నిర్మాణ పనులు, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతౌల్యం అవసరమనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
