మే 23, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. విద్యుత్ రంగ సంస్కరణలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదల, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై చర్చించనున్నారు. అలాగే ఇందిరమ్మ కుటుంబ బీమా, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, చేయూత పింఛన్లు, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పంటల మార్పిడి ప్రణాళిక వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
