మే 23, (నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిను జూబ్లీహిల్స్ నివాసంలో లంబాడ ప్రజాప్రతినిధుల బృందం కలిసింది. లంబాడీల ఆధ్యాత్మిక గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ పేరుతో “సంత్ సేవాలాల్ కార్పొరేషన్” ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ను వేరు చేసి ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ అవసరమని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.ఈ భేటీలో ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రాందాస్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.
