Breaking News

కిడ్నీ మార్పిడుల్లో నిమ్స్‌కు అరుదైన ఘనత.. వైద్య బృందాన్ని అభినందించిన సీఎం రేవంత్

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. యూరాలజీ విభాగం విజయవంతంగా 2 వేల కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.ఈ ఘనత సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అభినందించారు. కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందిస్తూ నిమ్స్ దేశంలోనే ప్రముఖ వైద్య సంస్థగా నిలుస్తోందని ప్రశంసించారు.కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో దక్షిణ భారతదేశంలో నిమ్స్ మొదటి స్థానంలో నిలవగా, దేశవ్యాప్తంగా గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ తొలి స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు. నిమ్స్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.మొత్తం 2 వేల మంది లబ్ధిదారుల్లో సుమారు 95 శాతం మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందడం విశేషమని ప్రభుత్వం పేర్కొంది. 2023 జనవరి నుంచి కేవలం మూడు సంవత్సరాల నాలుగు నెలల్లోనే 500 కిడ్నీ మార్పిడులు పూర్తి చేసి నిమ్స్ మరో రికార్డు సృష్టించింది.

గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని మృతి.. విషాదంలో కుటుంబం

డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయానికి కొత్త దిశ: మంత్రి తుమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *