మే 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఎం. వంశీమోహన్ను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వివాదాస్పద మరియు ప్రభుత్వ భూములను కబ్జా చేసి బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లను కలుపుకొని మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.6.22 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.అధికారుల అంచనా ప్రకారం వంశీమోహన్కు సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని లావాదేవీలు, భూముల వ్యవహారాలపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
