మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కీలక పోరు జరగనుంది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న Punjab Kingsకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.గెలిస్తే పంజాబ్ 15 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. అలాగే రేపటి మ్యాచ్ల్లో Kolkata Knight Riders, Delhi Capitals ఓడిపోతే పంజాబ్కు ప్లేఆఫ్స్ అవకాశం కలిసివచ్చే అవకాశం ఉంది.మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్న Lucknow Super Giants విజయంతో సీజన్ను ముగించాలని భావిస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠభరితంగా మారనుంది.
