Breaking News

ఏపీ రాజ్యసభ రేసు హోరాహోరీ.. ఆశావహుల జాబితా పెరుగుతోంది

మే 23, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల కోసం అధికార కూటమిలో తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీలో పలువురు సీనియర్ నేతలు, వ్యాపారవేత్తలు, సామాజిక వర్గ ప్రతినిధులు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.టీడీపీ నుంచి కిలారు రాజేశ్, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలాగే బీసీ కోటాలో చింతకాయల విజయ్, ఎస్సీ కోటాలో వర్ల రామయ్య, రాయలసీమ కోటాలో రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.మరోవైపు జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేశ్, భారతీయ జనతా పార్టీ తరఫున మాధవ్ పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది.కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా తుది నిర్ణయం ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *