మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.1 చొప్పున పెంపు నమోదైంది. తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.112.74కు చేరగా, డీజిల్ ధర రూ.100.88గా ఉంది. అలాగే పవర్ పెట్రోల్ రూ.123.06, సీఎన్జీ ధర రూ.106గా నమోదైంది.శుక్రవారం రాత్రి వరకు పెట్రోల్ రూ.111.74, డీజిల్ రూ.99.88, పవర్ పెట్రోల్ రూ.122.06గా ఉన్నట్లు బంక్ నిర్వాహకులు తెలిపారు. గత నాలుగు రోజుల వ్యవధిలోనే ఇది మూడోసారి ఇంధన ధరలు పెరగడం గమనార్హం.ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
