మే 23, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మరో అరుదైన రికార్డు నమోదు చేసింది. నిన్న RCBపై ఘన విజయం సాధించిన SRH, 220+ పరుగులు చేసిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన ఏకైక జట్టుగా నిలిచి చరిత్ర సృష్టించింది.ఇప్పటివరకు 12 మ్యాచుల్లో 220 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేసిన SRH, ఆ అన్ని గేమ్స్లో విజయవంతంగా డిఫెండ్ చేసి 100 శాతం విజయ రేటును కొనసాగిస్తోంది. ఈ అద్భుత గణాంకంతో SRH ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.ఇక ఇతర జట్లలో 220+ లక్ష్యాలను డిఫెండ్ చేసిన రికార్డులు చూస్తే, ముంబై ఇండియన్స్ 3 సార్లు, పంజాబ్ కింగ్స్ 3 సార్లు, రాజస్థాన్ రాయల్స్ 2 సార్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకసారి విజయాలు సాధించాయి.
