Breaking News

స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుతో సరిహద్దుల భద్రత కట్టుదిట్టం: అమిత్ షా

మే 23, (నేటి తెలుగు పత్రిక): పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్మార్ట్ బార్డర్’ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్లు, రాడార్లు, హైటెక్ కెమెరాలు మరియు ఆధునిక సాంకేతిక పరికరాలతో సరిహద్దుల వెంట 24 గంటల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి పూర్తి స్థాయి సరిహద్దు భద్రతా గ్రిడ్‌ను సిద్ధం చేసేలా పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.సైబర్ ముప్పులు, హైబ్రిడ్ యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థలు సాంకేతికంగా మరింత ఆధునికంగా మారాల్సిన అవసరం ఉందని అధికారులకు అమిత్ షా సూచించారు.

రూ.3 వేల కోట్ల మోసం కేసు.. హీరా గ్రూప్ చీఫ్ నౌహీరా షేక్ అరెస్ట్

చంద్రపూర్‌లో పులి దాడి.. నలుగురు మహిళల మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *