Breaking News

గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థిని మృతి.. విషాదంలో కుటుంబం

మే 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పల్లవి గౌడ్(19) మృతి చెందడం విషాదాన్ని కలిగించింది.ఛాతీ భాగంలో గడ్డ సమస్యతో ఈ నెల 16న ఆస్పత్రిలో చేరిన ఆమెకు 19వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించినట్లు సమాచారం. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి ఆమె కన్నుమూసింది.ఈ ఘటనలో వైద్యుల నిర్లక్ష్యం కారణమా లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మృతి సంభవించిందా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

బీఆర్ఎస్‌లో హరీశ్‌రావు భవిష్యత్తు ఆయనకే తెలియదు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

డ్రోన్ సాంకేతికతతో వ్యవసాయానికి కొత్త దిశ: మంత్రి తుమ్మల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *