Breaking News

2027 నాటికి శంకర్‌విలాస్ బ్రిడ్జి పూర్తి: పెమ్మసాని చంద్రశేఖర్

మే 23, (నేటి తెలుగు పత్రిక): గుంటూరు జిల్లాలో నిర్మాణంలో ఉన్న శంకర్‌విలాస్ బ్రిడ్జి పనులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. 2027 నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటివరకు 6 పిల్లర్ క్యాప్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.బీహార్ ఎన్నికల కారణంగా కార్మికుల కొరత ఏర్పడి సుమారు 20 రోజుల పాటు పనులు ఆలస్యమయ్యాయని మంత్రి వివరించారు. ఇకపై 70 మంది కార్మికులతో పనులను వేగవంతంగా కొనసాగిస్తామని చెప్పారు.వర్షాకాలానికి ముందే 30 పిల్లర్ల ఫౌండేషన్ పనులు పూర్తి చేశామని, మిగిలిన నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *