మే 23, (నేటి తెలుగు పత్రిక): యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయ అర్చకుల నుంచి ఆశీర్వచనం స్వీకరించారు. సీఎం వెంట మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
