Breaking News

యాదగిరిగుట్టలో వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మే 23, (నేటి తెలుగు పత్రిక): ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోనే అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ చేశారు.టెంపుల్ సిటీ పరిధిలో రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.రూ. 43.80 కోట్లతో 15 ఎకరాల్లో వేద పాఠశాల నిర్మాణం చేపట్టనుండగా, 300 మంది విద్యార్థులకు గురుకుల విధానంలో వేద విద్య అందించనున్నారు. హోమాలు, యాగాల కోసం ప్రత్యేక శాలలు, గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం, నిత్య కల్యాణ మండపం, మెట్ల మార్గానికి కానోపీ వంటి అనుబంధ నిర్మాణాలకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్‌లో టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధం.. తెలంగాణలో ఈవీ రంగానికి భారీ ఊపు

బీఆర్‌ఎస్‌కు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *