మే 26, (నేటి తెలుగు పత్రిక): ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నాగేశ్వర్ను హైదరాబాద్లో అరెస్ట్ చేస్తే సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.జనసేన పార్టీ, ఏపీ పోలీసులు కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కవిత విమర్శించారు. రాజకీయ విశ్లేషణలు చేసే మేధావిని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సమాజం గౌరవించే వ్యక్తిపై కేసులు నమోదు చేసి వేధించడం ఖండనీయమన్నారు.అలాగే భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో వడదెబ్బ మృతుడి కుటుంబానికి మార్చురీ వాహనం అందకపోవడంపై కూడా కవిత స్పందించారు. మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లాల్సి వచ్చిన ఘటన అమానవీయమని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
