Breaking News

తల్లికి వందనం డబ్బులు పొందాలంటే ఆధార్ లింక్ తప్పనిసరి

అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో “తల్లికి వందనం” పథకం కింద విద్యార్థికి రూ.13 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతేడాది ఆధార్ లింక్, బ్యాంకు సాంకేతిక సమస్యల కారణంగా పలువురు లబ్ధిదారులు డబ్బులు పొందలేకపోయారు.ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ సూచించింది. తల్లుల బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని అధికారులు తెలిపారు. అదేవిధంగా బ్యాంకుకు వెళ్లి NPCI మ్యాపింగ్ కూడా పూర్తి చేసుకోవాలని సూచించారు.ఆధార్-బ్యాంకు లింక్, NPCI మ్యాపింగ్ పూర్తిగా సరిగా ఉన్న ఖాతాలకే నేరుగా నగదు జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.

‘నన్ను ప్రశ్నించండి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

కరెంట్ సమస్యలకు 1912 టోల్ ఫ్రీ సేవ: మంత్రి గొట్టిపాటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *