Breaking News

ఉక్కు భూములపై కన్నేశారు: జగన్‌పై అచ్చెన్నాయుడు ఆరోపణలు

మే 26, (నేటి తెలుగు పత్రిక): విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను కూడా ఆక్రమించాలని జగన్‌రెడ్డి చూశారని విమర్శించారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడులో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారం కోసం జగన్‌రెడ్డి ఎవరినైనా వాడుకుంటారని, స్వార్థం కోసం ఎవరినైనా బలిచేసే నైజం ఆయనదని ధ్వజమెత్తారు.రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

‘నన్ను ప్రశ్నించండి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

కరెంట్ సమస్యలకు 1912 టోల్ ఫ్రీ సేవ: మంత్రి గొట్టిపాటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *