Breaking News

పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?

మే 26, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే దాదాపు రూ.8 వరకు పెరిగిన నేపథ్యంలో మరోసారి భారీ పెంపు ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత కొన్ని నెలల నష్టాల నుంచి పూర్తిగా కోలుకోవాలంటే ఇంధన ధరలను లీటరుకు మరో రూ.28 నుంచి రూ.33 వరకు పెంచాల్సి ఉంటుందని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది.అయితే ఒకేసారి అంత భారీగా ధరలు పెంచే అవకాశం తక్కువేనని, విడతల వారీగా క్రమంగా పెంపులు ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, దిగుమతి వ్యయాలు, డాలర్ మారకం విలువ వంటి అంశాల ప్రభావంతో ఆయిల్ కంపెనీలపై ఆర్థిక భారం పెరిగిందని పేర్కొంటున్నారు.ఇంధన ధరల పెరుగుదలతో ఇప్పటికే సామాన్య ప్రజలు, రవాణా రంగం, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. మరిన్ని పెంపుల వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. సిట్ ఎదుట అభిషేక్ సింగ్, రాకేశ్ వర్మ విచారణ

‘నన్ను ప్రశ్నించండి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *