మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం మజ్లిస్ పార్టీ ఒత్తిడితో తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. గతంలో కేసీఆర్ పాలనను ‘తుగ్లక్ పాలన’గా విమర్శించిన ఆయన, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మూడు కార్పొరేషన్లుగా విభజించినప్పటికీ ఇప్పటికీ సరైన సరిహద్దు మ్యాప్లు సిద్ధం కాలేదని ఆయన అన్నారు. నగర ప్రజలకు స్పష్టత లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగర ప్రజలు మేయర్ పదవులను బీజేపీకి అప్పగిస్తే పారదర్శక పాలన అందిస్తామని రామచంద్రరావు పేర్కొన్నారు.
