Breaking News

రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.. రూ.50 వేల వరకు రుణమాఫీ

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ప్రభుత్వం రైతులకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. సీఎం విజయ్ సహకార బ్యాంకుల్లో తీసుకున్న వ్యవసాయ రుణాలపై మాఫీ ప్రకటించారు. రూ.50 వేల వరకు ఉన్న రుణాలను పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.గత ఏడాది మే 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తించనుంది. అలాగే రూ.50 వేల నుంచి లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ రుణాలను ఆరు శ్లాబ్‌లుగా విభజించి రూ.20 వేల, రూ.15 వేల, రూ.10 వేల, రూ.5 వేల చొప్పున రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *