మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ బీజేపీ విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై 35.20 శాతం, డీజిల్పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తూ ప్రజలపై భారీ భారం మోపుతోందని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్ తగ్గించకుండా ప్రజల జేబులకు చిల్లులు పెడుతోందని బీజేపీ ట్వీట్ చేసింది. కనీసం వ్యాట్ను 50 శాతం తగ్గించినా లీటర్కు రూ.10 నుంచి రూ.14 వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.ఇంధన ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని బీజేపీ విమర్శించింది.
