Breaking News

ఇందిరమ్మ ఇళ్లపై కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్

మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కేటీఆర్ చేసిన సవాల్‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మే 23న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి చేసిన గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఈ అంశంపై ప్రజల ముందే చర్చకు సిద్ధమా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. సిట్ ఎదుట అభిషేక్ సింగ్, రాకేశ్ వర్మ విచారణ

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ బీజేపీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *