మే 26, (నేటి తెలుగు పత్రిక): ఎల్పీజీ సిలిండర్కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఆధారిత కుకింగ్ స్టవ్లను వినియోగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి సూచించారు. ఈ స్టవ్లు తక్కువ ఖర్చుతో పనిచేయడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయని చెప్పారు.ఇథనాల్ టెక్నాలజీ అభివృద్ధికి యువతను ప్రోత్సహించేలా రూ.40 కోట్ల ప్రత్యేక ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించినట్లు తెలిపారు. నీటిలో 7 శాతం ఇథనాల్ కలిపినా మంటలు వస్తాయని, వంట సమయంలో మసి, పొగ వంటి సమస్యలు ఉండవని వివరించారు.ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఇథనాల్ బేస్డ్ కుకింగ్ స్టవ్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
