మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారత కోసం త్వరలో “మహిళా శక్తి సూపర్ బజార్లు” ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. మహిళా వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సంఘ భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.మహిళా శక్తి సూపర్ బజార్లలో మహిళలు స్వయంగా పెట్టుబడులు పెట్టి, నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు.మహిళలు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్న సీఎం, మహిళా సంఘాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
