మే 26, (నేటి తెలుగు పత్రిక): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, మధ్యతరగతి ప్రజలు ఇంధన ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. గత రెండు వారాల్లోనే నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖర్గే, సామాన్య ప్రజల పొదుపును మోదీ ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి రూ.42 లక్షల కోట్లు వసూలు చేసిందని, ఇది రోజుకు వెయ్యి కోట్ల రూపాయల దోపిడీతో సమానమని ఆరోపించారు.ఇంధన ధరల పెంపు ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతూ సామాన్యుల జీవన వ్యయాన్ని మరింత పెంచుతోందని ఖర్గే పేర్కొన్నారు.
