మే 26, (నేటి తెలుగు పత్రిక): జార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడికి చెందిన నరహరి దాదాపు 45 ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతూ మావోయిస్టు దళంలో కీలక బాధ్యతలు నిర్వహించాడు.అడవుల్లో “ఆపరేషన్ కగార్” పేరుతో భద్రతా బలగాలు ముమ్మర కూంబింగ్ చేపట్టడంతోనే వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నరహరి దంపతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాస సదుపాయాలు కల్పిస్తామని అధికారులు వెల్లడించారు.
