మే 26, (నేటి తెలుగు పత్రిక): క్వాడ్ దేశాల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ఆర్థిక, వ్యూహాత్మక వ్యవస్థకు కేంద్రబిందువుగా మారుతుందని పేర్కొన్నారు. సభ్యదేశాల సమిష్టి సహకారంతో ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించబోమని స్పష్టం చేసిన జైశంకర్.. సముద్ర మార్గాల్లో వాణిజ్యం నిరంతరాయంగా సాగేందుకు క్వాడ్ దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఇదే సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. క్రిటికల్ మినరల్స్, ఇంధన భద్రత అంశాలపై క్వాడ్ దేశాలు ప్రత్యేక విధానాలు రూపొందించనున్నట్లు వెల్లడించారు.
