మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం బీజేపీ చేపట్టిన రైతు యాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ యాత్ర రైతుల కోసం కాదని, బీఆర్ఎస్కు మద్దతుగా నిర్వహిస్తున్న రాజకీయ డ్రామా అని ఆరోపించారు. రైతుల సమస్యలకు బీజేపీ, బీఆర్ఎస్ విధానాలే కారణమని అన్నారు.ధాన్యం కొనుగోలు విషయంలో ప్రధాని మోదీని ఒప్పించి ప్రతి గింజను కొనిపించాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, రైతులు పండించిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
