అమరావతి, మే 26, (నేటి తెలుగు పత్రిక): ఈసారి మహానాడును ‘మహిళా శక్తి’ థీమ్తో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర, దేశ పరిస్థితుల దృష్ట్యా మహానాడును ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని, జూమ్ యాప్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి కార్యక్రమాలు నిర్వహించడం రికార్డుగా నిలుస్తుందని చెప్పారు. యువత కోసం మెగా డీఎస్సీ, గ్రూప్-4, ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టామని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
