మే 26, (నేటి తెలుగు పత్రిక): శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్లో రూ.1000 కోట్ల విలువైన 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు భారీ కుట్ర జరిగిందని బీఆర్ఎస్ నేత టి హరీశ్ రావు ఆరోపించారు. హైకోర్టులో ఆర్డీవో ప్రభుత్వ భూమిగా అఫిడవిట్ దాఖలు చేసిన నాలుగు రోజులకే ఎంఆర్వో అదే భూమిని ప్రైవేటు భూమిగా నివేదించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. భూభారతిలో కూడా నమోదు చేయడం వెనక ప్రభుత్వ పెద్దల జోక్యం లేకుండా సాధ్యం కాదని విమర్శించారు. కేవలం ఎంఆర్వోను బదిలీ చేసి వ్యవహారాన్ని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు.
