మే 26, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సీఎం మార్పుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని తెలిపారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్లతో రాజ్యసభ ఎన్నికల అంశంపైనే చర్చించామని వెల్లడించారు. సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టినట్టైంది.
