మే 26, (నేటి తెలుగు పత్రిక): తన తండ్రి వైఎస్సార్, తాత రాజారెడ్డి దుర్మార్గులే అయితే అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఎందుకు విచారణ జరపలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఈ లోకంలో లేని వారిపై టీడీపీ నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాజారెడ్డి సీమలో అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలిచారని, వైఎస్సార్ సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా నిలిచారని పేర్కొన్నారు. బురద జల్లినా సూర్యుడి కాంతి తగ్గదని, ఇకనైనా అసత్య ప్రచారాలు ఆపాలని టీడీపీకి సూచించారు.
