మే 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో నగర తాగునీటి సమస్యలపై మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్, వాటర్ బోర్డు ఎండీ అశోక్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు, వర్షాకాల సన్నద్ధత అంశాలపై విస్తృతంగా చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగరంలోని నీటి సమస్యలు, నదుల పరిరక్షణ చర్యలను అధికారులు వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి పొదుపు, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులు అధికారులకు సూచించారు.
