మే 26, (నేటి తెలుగు పత్రిక): మేకెదాటు డ్యామ్ నిర్మాణ ప్రతిపాదనను తిరస్కరించాలని తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం భూమిపూజకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేశారు. కావేరి ట్రిబ్యునల్ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పులను ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని ఆయన ఆరోపించారు. మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కోరారు. ఇదే అంశంపై విజయ్ త్వరలో ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
