మే 26, (నేటి తెలుగు పత్రిక): గండిపేట మండలం కోకాపేట కొత్త చెరువులో జరిగిన భారీ ఆక్రమణలపై హైడ్రా అధికారులు మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. 72 ఎకరాల విస్తీర్ణం గల చెరువులో విల్లాస్, నిర్మాణ సంస్థలు కలిపి 22 ఎకరాల మేర కబ్జా చేసినట్లు గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన అధికారులు ప్రహరీలు, ఫెన్సింగ్లను తొలగించి చెరువు హద్దులను పునరుద్ధరించారు. మరోవైపు కూకట్పల్లి ఖైతలాపూర్లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కార్యాలయం, షెడ్డును కూడా హైడ్రా కూల్చివేసింది.
