Breaking News

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్‌కు ఉత్తమ్ సవాల్

మే 26, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే యాసంగిలో ఎక్కువ కొనుగోళ్లు జరిగాయని వెల్లడించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలో రెట్టింపు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై బీజేపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని ఉత్తమ్ సవాల్ విసిరారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *