మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా కేంద్ర నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారం వంటి విషయాలను విజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
