Breaking News

మోదీతో సీఎం విజయ్ భేటీ.. ఢిల్లీ పర్యటనపై ఆసక్తి

మే 26, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళగ వెట్రి కజగం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా కేంద్ర నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారం వంటి విషయాలను విజయ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మేకెదాటు ప్రాజెక్టుకు బ్రేక్ వేయండి.. మోదీకి విజయ్ లేఖ

కర్ణాటకలో సీఎం మార్పుపై ఫుల్ క్లారిటీ.. ఊహాగానాలకు కాంగ్రెస్ చెక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *