మే 27, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్టియర్ సిలబస్లో పలు కీలక మార్పులు చేసింది. వివిధ సబ్జెక్టుల్లో పునరావృతమవుతున్న పాఠాలను తొలగించడంతో పాటు, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కొత్త అంశాలను చేర్చింది.పాఠ్యపుస్తకాలలో వీడియో, ఆడియో రూపంలో లెసన్స్ వినేందుకు QR కోడ్లను పొందుపరిచారు. తెలుగు సబ్జెక్టులో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాఠ్యాంశాలను చేర్చగా, గణితంలో ‘Do You Know’ బాక్సులు, ప్రముఖ శాస్త్రవేత్తల పరిచయాలను జోడించారు. ఫిజిక్స్లో ‘AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ అనే కొత్త అంశాన్ని ప్రవేశపెట్టారు. అలాగే సైన్స్ సబ్జెక్టులను NCERT సిలబస్కు అనుగుణంగా సవరించినట్లు అధికారులు తెలిపారు.
